GDWL: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని, శైవ క్షేత్రాల దర్శనం కోసం ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించిందని గద్వాల డిపో మేనేజర్ సునీత శుక్రవారం తెలిపారు. అరుణాచల దర్శిని పేరుతో ప్రకటించిన ఈ ప్యాకేజీ ద్వారా భక్తులు 3 రోజుల్లో అరుణాచలం,గోల్డెన్ టెంపుల్,కాణిపాకం పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. సూపర్ లగ్జరీలో రూ. 3,600, డీలక్స్లో రూ. 2,950 కలవు అని ఆమె పేర్కొన్నారు.