SRCL: కోనరావుపేట మండలం మల్కాపేట గ్రామంలోని మున్నూరు కాపు సంఘ భవనం నిర్మాణం కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రూ. 5 లక్షలు మంజూరు చేశారు. బుధవారం ప్రొసీడింగ్ పత్రాన్ని కోనరావుపేట మండల BJP అధ్యక్షులు మిర్యాల కార్ బాలాజీ మున్నూరు కాపు సంఘం సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.