మేడ్చల్: ప్రజలు అందరూ లోన్ యాప్తో అప్రమత్తంగా ఉండాలని బాలానగర్ సీఐ టీ.నర్సింహరాజు హెచ్చరించారు. లోన్ యాప్లో రుణాలు తీసుకొని వారి నుంచి వచ్చే వత్తిడితో డబ్బులు తిరిగి చెల్లించే పరిస్థితి లేక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలానగర్ పరిధిలో గల వినాయకనగర్కు చెందిన తరుణ్ రెడ్డి ఘటనతో మేల్కొని ప్రజలు, ముఖ్యంగా యువత లోన్ యాప్లను ఆశ్రయించొద్దని హెచ్చరించారు.