MLG: జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం వర్షం కురిసింది. గత రాత్రి ఈదురుగాలులు, భారీ వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. పంట పొలాలు దెబ్బతినడంతో పాటు మామిడి పంటకు గణనీయ నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమ గోడును వెలిబుచ్చిన రైతులు ప్రభుత్వ సాయం కోరుతున్నారు.