MBNR: చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని దేవాదాయ శాఖ స్థపతి వల్లీ నాయక్ సందర్శించారు. మహా మండపం నిర్మాణానికి సంబంధించి స్థల పరిశీలన చేసి అధికారులకు సూచనలు చేశారు. దాతల సహకారంతో చేపట్టనున్న నిర్మాణానికి త్వరలో ప్లాన్, అంచనాలు సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ మదనేశ్వర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అర్చకులు పాల్గొన్నారు.