WGL: చెన్నారావుపేట మండలం ఝల్లి పరిధి బోడతండాకు చెందిన మోహన్ అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. మోహన్ CMRF కోసం దరఖాస్తు చేసుకోగా.. రూ.40 వేల చెక్కు మంజూరైంది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి గురువారం ఉదయం బాధితుడి ఇంటికి వెళ్లి ఈ చెక్కును అందించారు.