SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో వడగళ్ల వానతో నష్టపోయిన పంటలను గురువారం ప్రజాప్రతినిధులు అధికారులు పరిశీలించారు. మండల వ్యవసాయ అధికారితో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ ఐరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి పంటల నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఈ అకాల వర్షం వల్ల తీవ్ర స్థాయిలో పంట నష్టం జరిగిందన్నారు.