NLG: రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం ధరలు సామాన్యుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. వానాకాలంలో జిల్లా వరి ఉత్పత్తి పెరిగినా కొత్త బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం నల్గొండ మార్కెట్లో సన్నబియ్యం కిలో రూ50 నుంచి 75కు పెరిగింది. జిల్లాలో దిగుబడులు పెరిగినా. ధరలు తగ్గాల్సి ఉండగా ఎక్కడా ఆ పరిస్థితులు కనిపించడం లేదని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.