NRML: దసరా పండుగ ప్రజలకు సుఖశాంతులు తేవాలని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ ఆకాంక్షించారు. దసరా పండుగను పురస్కరించుకొని గురువారం రాత్రి ఖానాపూర్ పట్టణంలో నిర్వహించిన శమీ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి విజయం సాధించిన రోజు దసరా అని పేర్కొన్నారు.