WNP: పర్యావరణానికి, పక్షులకు హాని కలిగించే చైనా మాంజా విక్రయాలు వాడకంపై నిషేధం ఉందని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. సంక్రాంతి సందర్భంగా దుకాణాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలో ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప్రాణాపాయం కలిగించే ఈ మాంజాను విక్రయించ వద్దని వాడ వద్దని ప్రజలకు సూచించారు.