MDK: శివంపేట మండలం చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక శనివారం పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఫౌండర్ ఛైర్మన్ ఆంజనేయ శర్మ, ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాత్రి ఆంజనేయ స్వామి వద్ద కార్తీక దీపోత్సవం నిర్వహించారు. మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.