AP: మంత్రులు లోకేష్, అనిత ఢిల్లీ చేరుకున్నారు. వీరికి టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. మంత్రుల వెంట కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు తదితరులు ఉన్నారు. లోకేష్, అనిత రేపు కేంద్రమంత్రులు అమిత్ షా, శివరాజ్సింగ్ చౌహాన్ను కలవనున్నారు. ఈ సందర్భంగా ఏపీలో మొంథా తుఫాన్ నష్టంపై వివరించనున్నారు. ఈ భేటీలో మంత్రులతో పాటు టీడీపీ ఎంపీలు పాల్గొననున్నారు.