MDK: తునికి నల్ల పోచమ్మ అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామంలోని తునికి నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.