KMM: నేలకొండపల్లి, ముదిగొండ మండలంలో ధాన్యం అమ్ముకునేందుకు తిప్పలు తప్పడం లేదని రైతులు వాపోయారు. గురువారం పలువురు రైతులు మాట్లాడుతూ.. మిల్లర్లు తాము పండించిన ధాన్యాన్ని నేరుగా మిల్లుకు తీసుకురావాలని చెప్తున్నట్లు పేర్కొన్నారు. మిల్లుకు ధాన్యం తరలిస్తే రూ.1800లకు కొనుగోలు చేస్తామని, ప్రభుత్వం ఇచ్చే రూ.500 బోనస్ అందిస్తామని చెప్తున్నట్లు తెలిపారు.