SRPT: ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ప్రజల నుంచి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 నంబరు సమాచారం అందించాలని ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపారు. శనివారం హుజూర్నగర్ తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ ఆధ్వర్యంలో దాడులు చేసి మీడియాతో మాట్లాడారు. ధరణి ఆపరేటర్ లంచం డిమాండ్ చేయడంతో రైతు తమను ఆశ్రయించడంతో మెరుపు దాడి చేసినట్లు తెలిపారు.