KMM: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కారమయ్యేలా చూడాలని KMC కమిషనర్ అభిషేక్ అగస్త్య సూచించారు. సోమవారం KMCలో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తు వెంటనే పరిశీలించాలని, ముఖ్యంగా రెవెన్యూ సంబంధిత అంశాలు వేగంగా పరిష్కారం చూపించాలన్నారు.