KNR: రూరల్ మండలం చెర్ల బూత్కూరు గ్రామానికి చెందిన సుమారు 200 మంది రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ జరగలేదని రైతు సంఘం నాయకులు కూర అమరేందర్ రెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు పెండ్యాల శ్యాం సుందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా వారు రుణమాఫీ మంజూరు కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్కు వినతి పత్రం ఇచ్చారు.