KMM: వ్యవసాయ మార్కెట్కు అధికారులు రేపు, ఎల్లుండి సెలవులు ప్రకటించారు. శనివారం వారంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో ఈ రెండు రోజులు మార్కెట్లో క్రయవిక్రయాలు జరగవని చెప్పారు. తిరిగి సోమవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని పేర్కొన్నారు.