KMR: పోచారం ప్రాజెక్టు నుంచి యాసంగి పంటల కోసం ఇప్పటి వరకు 0.541TMCల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. వర్షాకాలం నుంచి ప్రాజెక్టులోకి మొత్తం 30.543 TMCల నీరు వచ్చి చేరిందని అన్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత వల్ల 30 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోందని వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.820TMCలు కాగా,ప్రస్తుతం 1.05TMC నీరు నిల్వ ఉంది.