WGL: పర్వతగిరి మండల కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వై.వి. గణేష్ మంగళవారం సందర్శించారు. 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పరిశీలించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, పరిపాలన విధానాలు, నర్సరీ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలోగ్రామ సర్పంచ్ చీదురు శంకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.