వనపర్తి: జాతిపిత మహాత్మ గాంధీ జయంతి వేడుకలను జిల్లాల్లోని ఆర్టీసీ డిపోలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆర్టీసీ డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గాంధీ అహింసా మార్గంతోనే దేశానికి స్వాతంత్య్రం సాధించారని, ప్రతిఒక్కరూ మహాత్ముడుని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తెలిపారు.