HYD: బ్యాంకాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 37 పాములు, తాబేళ్లను శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. ప్రాణాలతో ఉన్న 28 రెడ్ టెయిల్డ్ బాంబూ పిట్ వైపర్లు, 3 స్పైడర్ టెయిల్డ్ హార్మ్ వైపర్లు, 6 తాబేళ్లను షేక్ నిజాముద్దీన్, షేక్ అల్తాఫ్ అలీ ముంబయికి తరలిస్తున్నారు. అనుమానం వచ్చి కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా పాములు, తాబేళ్లు బయటపడ్డాయి.