GDWL: మానవపాడు మండలం అమరవాయి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ పాల్గొని భూమిపూజ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకంలో భాగంగా ఈ పనులు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో నీలి శ్రీనివాస్, దొడ్డప్ప, పచ్చర్ల కుమార్, మహమ్మద్ సిరాజు పాల్గొన్నారు.