NGKL: జిల్లా సాధారణ ఆసుపత్రిలో మంగళవారం మహిళలకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ శేఖర్ తెలిపారు. స్త్రీ వైద్య నిపుణులు నీలిమ, సుప్రియల బృందం ఆధ్వర్యంలో ఈ శిబిరం కొనసాగనుంది. ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి రక్షణ పొందేందుకు జిల్లాలోని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.