వరంగల్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటల వరకు మొత్తం 59.11 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.