WGL: జిల్లా కోర్టు ప్రాంగణంలో చేనేత ప్రదర్శన, అమ్మకాల మేళా మంగళవారం ప్రారంభమైంది. WGL, HNK జిల్లాల కోర్టు ప్రధాన న్యాయమూర్తి లలితంబ, పట్టాభిరాములు ముఖ్య అతిథులుగా హాజరై సంయుక్తంగా ఈ ప్రదర్శన శాలను ప్రారంభించారు. చేనేత హస్తకళలను, వస్త్రాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు, తదితరులు ఉన్నారు.