కేరళ కొచ్చిలోని తమ్మనం అనే ప్రాంతంలో కేరళ వాటర్ అథారిటీకి చెందిన నీటి ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా జనావాసాలపై 1.35 కోట్ల లీటర్ల నీళ్లు వెళ్లాయి. ఫలితంగా ఇళ్ల వద్ద పాక్కింగ్ చేసిన వాహనాలు, ఫర్నీచర్తో పాటు అనేక ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా ఆ ప్రాంతంలోని ఆరోగ్య కేంద్రలోకి నీరు చేరడంతో మెడిసన్స్, వైద్య పరికరాలు దెబ్బతిన్నాయి.