NLG: కనగల్ మండలం కుమ్మరిగూడేనికి చెందిన భారతి నిన్న సాయంత్రం ఫ్యాన్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యక్తిగత సమస్యలతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సీవుంది.