HYD: మీర్పేట హెచ్బీ కాలనీ డివిజన్లోని భక్షిగూడ, కృష్ణనగర్ కాలనీలలో 33 లక్షల 50 వేల రూపాయల అంచనా వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి విషయంలో అవసరమైన సహకారం అందిస్తూ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.