KMM: మధిర టౌన్ పోలీస్ స్టేషన్లో రవీందర్ రెడ్డి గత కొంతకాలంగా హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ ఏఎస్సైగా ప్రమోషన్ పొందారు. గురువారం మర్యాదపూర్వకంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజంను ఏఎస్సై రవీందర్ రెడ్డి కలిసి పూల మొక్కను అందజేశారు. మధిర పోలీస్ స్టేషన్ SHO, సీఐ రమేష్, రూరల్ సీఐ మధు, పోలీస్ సిబ్బంది రవీందర్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు.