ADB: బోథ్ మండలంలోని నకలవాడ గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ మండల నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దైవచింతనతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రజలందరూ నడవాలని పిలుపునిచ్చారు.