HYD: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా ఉండాలని పారిశుధ్య కార్మికులకు ఆర్పీఎఫ్ ఇన్ స్పెక్టర్ సరస్వత్ శనివారం సూచించారు. ప్లాట్ ఫాం నంబరు 10 సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో 120 మంది పారిశుధ్య కార్మికులు, స్టాళ్ల ఉద్యోగులు పాల్గొన్నారు. అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.