మహబూబ్ నగర్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ MUDA ఛైర్మన్ గంజి వెంకన్న, నాయకులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.