KMR: భిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డికి చెందిన అవుసుల కార్తీక్(12) రెండంతస్తుల భవనంపై నుంచి కిందపడి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. సంక్రాంతి రోజు భవనంపై గాలిపటాలు ఎగరవేస్తుండగా ప్రమాదవశత్తు కిందపడినట్లు చెప్పారు. తీవ్ర గాయాలైన బాలుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.