KNR: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఆయన సతీమణితో కలిసి సొంత గ్రామం పచ్చునూరులో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్ అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపిస్తున్నారని పేర్కొన్నారు.