మంచిర్యాల: తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి జన్నారం మండల స్థాయిలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నామని ఎంఈఓ విజయ్ కుమార్, ఇంఛార్జి పీడీ సాగర్ జరిపారు. హకీంపేట కరీంనగర్ ఆదిలాబాద్ స్పోర్ట్స్ పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి గురువారం ఉదయం 9 గంటలకు జన్నారంలోని బాలుర జడ్పీ పాఠశాలలో ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు.