ADB: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ అన్నారు. గుడిహత్నూర్ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదన్నారు. 12 నెలల కాలంలో ఏ ఒక్కరికి కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.