NGKL: జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 19 దరఖాస్తులు అందాయి. కలెక్టర్ ఏఓ చంద్రశేఖర్ ఈ దరఖాస్తులను స్వీకరించి, వాటిని పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలన్నారు.