వనపర్తి: పట్టణంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గాంధీ చౌక్లోని మహాత్మగాంధీ విగ్రహానికి దేశ రెండవ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సత్యం, అహింస మార్గంలో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టిన బాపూజీ జీవితం, బోధనలు యావత్ మానవాళికి మార్గదర్శకం అని పేర్కొన్నారు.