PDPL: డిమాండ్ల సాధన కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు మంగళవారం పెద్దపల్లిలో నిరవధిక సమ్మెకు దిగారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా జేఏసీ అధ్యక్షులు తిరుపతి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.