WGL: దుగ్గొండి మండలంలోని పలు గ్రామాలలో BRS పార్టీ అభ్యర్థుల గెలుపుకొరకు నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం ఉదయం ప్రచారం నిర్వహించారు. 420 హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. గత పదేళ్ళలో BRS ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు.