HNK: పరకాల పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనం వద్ద బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక పరకాల MLA రేవూరి ప్రకాష్ రెడ్డి ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై, జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.