ADB: ఆదివాసి ప్రజల నుండి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా అన్నారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొని ఆదివాసి ప్రజల నుండి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఆదివాసులు ఉన్నారు.