BHPL: చిట్యాల మండల కేంద్రంలోని కాల్వపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం టీచర్ తిరుమల ఆధ్వర్యంలో తల్లుల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ICDS సూపర్వైజర్ జయప్రద హాజరై మాట్లాడుతూ.. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను మెరుగ్గా అందించాలని సూచించారు. అంగన్వాడీ ద్వారా అందే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.