NRML: గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు లాల్ బహదూర్ శాస్త్రి, మహాత్మా గాంధీల జయంతి సందర్భంగా చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్రోద్యమంలో వీరి పాత్ర అపూర్వమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.