MLG: మేడారంలో సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొండా సురేఖతో విభేదాల గురించి జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. “చిన్న కాంట్రాక్టుల కోసం ఆశపడను. సురేఖ నాపై ఫిర్యాదు చేశారని అనుకోవడం లేదు. ఈ రోజు ఆమె పర్యటనకు రాకపోవడానికి ప్రత్యేక కారణం లేదు. అందరూ ఎప్పుడూ ఉండాలనేం లేదు. తదుపరి పర్యటనలో అందరూ ఉంటారు” అని తెలిపారు.