WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని బీసీ బారుల వసతి గృహాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు బోధించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ జిల్లా అధికారి పుష్పలత, తదితరులు పాల్గొన్నారు.