SRPT: తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శతజయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లంల యాదగిరి మాట్లాడుతూ.. సీపీఐ పార్టీ చరిత్ర ఎంతో గొప్పదని, నిరంతరం ప్రజా పోరాటాలు కొనసాగిస్తుందని, ఈనెల 30న నల్గొండ జిల్లాలో జరిగే సీపీఐ పార్టీ శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.