HYD: తెలంగాణ బీజేపీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇంకో 50 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కనిపించడంలేదన్నారు. తెలంగాణలో బీజేపీ చనిపోతుంది.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ దయచేసి కాపాడండని రాజాసింగ్ కోరారు.