MNCL: బెల్లంపల్లి-రేచిని రైల్వే స్టేషన్ల మధ్య కట్టెల కోసం రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని వృద్ధుడు మరణించాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సంపత్ వివరాలు ప్రకారం.. రాంనగర్కు చెందిన వెంకటస్వామి(68) కట్టెల కోసం రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.